న్యూఢిల్లీ : చైనా యాప్లపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. బ్యాన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకునే ప్రతిపాదన ఏదీ మంత్రిత్వశాఖ వద్ద లేదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నిషేధించిన చైనా యాప్ల వినియోగాన్ని దేశంలో పునః ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా? అనే ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
గతేడాదిలో పబ్జీ మొబైల్, టిక్టాక్, వీబో, వీచాట్, అలీ ఎక్స్ప్రెస్ సహా వందలాది చైనీస్ యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. 2020 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం 43 చైనాకు చెందిన 43 మొబైల్ యాప్లను బ్లాక్ లిస్ట్లో చేరుస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఆదేశాలు జారీ చేసింది. దేశ సౌర్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకొని యాప్లను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అంతకు ముందు సైతం జూన్ 29న భారత్ 59 యాప్లను బ్లాక్ చేయగా.. సెప్టెంబర్ 2న ఐటీచట్టంలోని సెక్షన్ కింద 118 యాప్లను నిషేధించింది.