Nitish Kumar: బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీల సభ్యులు ‘నితీశ్కుమార్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో ‘నితీశ్ ముర్దాబాద్, నితీశ్ ముర్దాబాద్’ అంటూ పెద్ద పెట్టున నినదించారు.
దాంతో నితీశ్ కుమార్ అసహనానికి గురయ్యారు. ‘ఆ నితీశ్ కుమార్ ముర్దాబాద్.. అప్ సబ్లోగ్ జిందాబాద్’ అని వ్యాఖ్యానించారు. ‘మేం ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయాల ద్వారా చికిత్స అందిస్తున్నాం. అందుకే నితీశ్ కుమార్ ముర్దాబాద్’ అని వ్యంగ్యంతో కూడిన కోపంతో అన్నారు. ‘మీ హయాంలో మీరు ప్రతి ఒక్కరూ చావాలని కోరుకున్నారు’ అని ఆగ్రహంగా మాట్లాడారు.
కాగా, నితీశ్కుమార్ ఈ టర్మ్లో మొత్తం మూడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఎన్డీఏ కూటమి తరఫున సీఎంగా పనిచేసిన నితీశ్.. అనంతరం బీజేపీతో విభేదించి ఎన్డీఏ కూటమిని వీడారు. ఆ తర్వాత మహా కూటమి తరఫున రెండో సారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇటీవల కాంగ్రెస్తో విభేదించి మహాకూటమితో తెగదెంపులు చేసుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరి మూడో సారి సీఎంగా ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ ఆదేశాల మేరకు సోమవారం (నిన్న) అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో నితీశ్ మాట్లాడుతుండగా విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల సభ్యులు అడ్డుకున్నారు.
#WATCH | Patna: Opposition MLAs raise slogans against Bihar CM Nitish Kumar during his speech in the Bihar Vidhan Parishad. pic.twitter.com/lBQN3R0GfN
— ANI (@ANI) February 13, 2024