లక్నో: ప్రధాని నరేంద్ర మోదీకి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంగి వంగి దండాలు పెట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీంతో బీహార్లోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వానికి సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత యోగి ఆదిత్యనాథ్ను నితీశ్ కుమార్ అభినందించారు. అనతరం ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వంగి నమస్కరించారు.
మరోవైపు బీహార్లోని ప్రతిపక్ష ఆర్జేడీ దీనిపై విమర్శలు గుప్పించింది. 2013లో బీజేపీతో తెగదెంపుల సందర్భంగా నితీశ్ కుమార్ చేసిన ప్రసంగం వీడియోను ఈ ఫొటోకు జత చేసి ట్విట్టర్లో షేర్ చేసింది. ఇకపై ఎప్పుడూ కూడా బీజేపీతో కలవబోను అన్న నితీశ్, తన హామీని చెత్తలో పడేసి బీజేపీకి వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
"नीतीश कुमार भी दिखाई दे रहे हैं!"
पर अफ़सोस जिनके लिए गए थे, उनको नीतीश कुमार दिखाई नहीं दिए! pic.twitter.com/uNW6YGywiD
— Rashtriya Janata Dal (@RJDforIndia) March 25, 2022
अपनी अपनी औकात की बात है।@laluprasadrjd#Bihar#LaluPrasadYadav pic.twitter.com/q4zvEzUY3e
— Tariq (@TQ22AMU) March 25, 2022