తిరువనంతపురం : ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమై నైట్కర్ఫ్యూను అమలులోకి తీసుకువచ్చింది. ఈ నెల 30 అమలులోకి రానుండగా.. జనవరి 2వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగనున్నది. రాత్రి 10 గంటల కర్ఫ్యూ మొదలై.. మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది.
ఈ సందర్భంగా రద్దీతో పాటు అనవసర ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు. సోమవారం నాటికి కేరళలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 57కు పెరగ్గా.. హై అలర్ట్ ప్రకటించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఒమిక్రాన్ మరింత వ్యాపించే అవకాశాలుండడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నైట్కర్ఫ్యూ విధించింది.