న్యూఢిల్లీ, మార్చి 27: నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన ఎన్సీఈఆర్టీ పుస్తకాలను 2024-25 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని కేంద్ర విద్యాశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. ఇ ది కష్టమైన టాస్క్ అని, అయితే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. కొత్త నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్) ఆధారంగా టెక్స్బుక్స్ను రివైజ్ చేస్తామని, ఇది చా లా శ్రమతో కూడినదని విద్యాశాఖ సీనియర్ అధికారి అన్నారు. సవరించిన పుస్తకాలను డిజిటల్ రూపంలో కూడా తీసుకొస్తామని, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.