న్యూఢిల్లీ : జమ్ము-కశ్మీర్ రాష్ట్ర హోదా కోసం 20న (నేడు) ఢిల్లీలోని జంతర్మంతర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)నిరసన చేపట్టనుంది. అయితే జమ్ములో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 12 మంది చనిపోవడంతో.. పరిస్థితిని వ్యక్తిగతంగా సమీక్షించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్ముకు ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ నిరసనలకు నాయకత్వం వహించబోతున్నారు. ‘వాతావరణ శాఖ జమ్ముకు భారీ వర్షాలు, వరదల ముప్పు ఉందని హెచ్చరించినందున.. నేను సమీక్షించేందుకు జమ్ము వెళ్తున్నా. నిరసనలు ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలో కొనసాగుతాయి’ అంటూ ఒమర్ ఎక్స్లో తెలిపారు.