Madhya Pradesh : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం అత్యవసర ల్యాండింగ్ అయింది. హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ధార్ జిల్లాలోని మనావర్ టౌన్లో హెలిక్యాప్టర్ను కిందికి దింపారు. దాంతో, సీఎం శివ్రాజ్ సింగ్ రోడ్డు మార్గంలో 75 కిలోమీటర్లు ప్రయాణించి ధార్ చేరుకున్నారు. ధార్లో ఒక పబ్లిక్ ర్యాలీలో పాల్గొనేందుకు మనావర్ నుంచి ధార్కు శివ్రాజ్సింగ్ హెలిక్యాప్టర్లో బయలుదేరారు. అయితే.. మార్గమధ్యలోనే హెలిక్యాప్టర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాంతో, అప్రమత్తమైన పైలట్స్ సురక్షితంగా అత్యవరస ల్యాండింగ్ చేశారు. సీఎం చౌహన్ రోడ్డు మార్గంలో ధార్ చేరుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. దాంతో, కమల్నాథ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివ్రాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది నవంబర్లో మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి.
Madhya Pradesh | CM Shivraj Singh Chouhan’s helicopter made an emergency landing due to a technical problem in Manawar while CM Chouhan was going to Dhar from Manawar. He is now going to Dhar via road: CMO pic.twitter.com/iIb3ej7zPF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 15, 2023