వాషింగ్టన్: అమెరికాలో భారతీయ వ్యక్తి మొహమ్మద్ ఆసిఫ్ కోవిడ్ సమయంలో మెడికల్ ఫ్రాడ్(Medical Fraud Case)కు పాల్పడ్డాడు. ఆ కేసులో అమెరికా అటార్నీ ఛార్లెస్ నీల్ ఫ్లాయిడ్ ఆదేశాలు జారీ చేశారు. డయాగ్నస్టిక్ ల్యాబ్ ద్వారా మెడికేర్లో అవకతవకలకు పాల్పడిన ఆసిఫ్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ల్యాబ్ ద్వార వసూల్ చేసిన సుమారు 1.17 మిలియన్ల డాలర్ల డబ్బును తిరిగి చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
వాషింగ్టన్లోని ఎవరెట్లో అమెరికన్ ల్యాబ్వర్క్స్ ఎల్ఎల్సీ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఆసిఫ్ నడిపారు. అయితే కోవిడ్ వేళ మెడికేర్ సంస్థకు ల్యాబ్ సేవలు అందించారు. కానీ ఆ సమయంలో భారీ అవినీతికి అతను పాల్పడ్డాడు. అక్రమ రీతిలో బిల్లులు వసూల్ చేశాడు. హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసులో ఆసిఫ్ను ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టు చేశారు.
చికాగోలోని విమానాశ్రయం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన అతన్ని పట్టుకున్నారు. జైలుశిక్ష పూర్తి అయిన తర్వాత అతన్ని డిపోర్ట్ చేయనున్నారు. అమెరికా రికార్డుల ప్రకారం ఆసిఫ్ తన ల్యాబ్ను 2021లో ప్రారంభించారు. మార్చి 2025లో దాన్ని మూసివేశారు. ఆ ల్యాబ్కు చెందిన మెడికల్ టెస్ట్ సైట్ లైసెన్సు 2023 డిసెంబర్లో ముగిసింది. అమెరికన ల్యాబ్వర్క్ టెస్టింగ్ సేవల కోసం సుమారు 8 మిలియన్ల డాలర్లు వసూల్ చేసింది. దాంట్లో మెడికేర్ సంస్థ 1.1 మిలియన్ డాలర్లను చెల్లించింది.
వృద్ధ, పేద ప్రజల చికిత్స కోసం ఏర్పాటు చేసిన నిధి నుంచి మెడికేర్ సిస్టమ్ ద్వారా డబ్బును వసూల్ చేశారని, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని జిల్లా జడ్జీ జేమ్స్ రాబర్ట్ తెలిపారు.