న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్లో ప్రధాని నరేంద్రమోదీ సమూల మార్పులు చేశారు. బుధవారం 36 మంది కొత్త మంత్రులను తీసుకోవడంతోపాటు ఏడుగురు సహాయ మంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించారు. ఇక 12 మంది సీనియర్ మంత్రులను తప్పించారు. 2019 మేలో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణ ఇది.
రాష్ట్రపతి భవన్లో 15 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్విని వైష్ణవ్ నూతన రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. మాన్సుఖ్ మాండవియా కొత్త ఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులయ్యారు.
జ్యోతిరాదిత్య సింధియాకు పౌర విమానయానం అప్పగించారు. ఇంతకుముందు ఆయన తండ్రి మాధవ్ రావు సింధియా కూడా ఇదే శాఖను నిర్వహించడం గమనార్హం. ఇక కిరణ్ రిజిజు నూతన న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ- సిబ్బంది వ్యవహారాలు, పబ్లిక్ గ్రీవియెన్స్ అండ్ పెన్షన్స్, అణు ఇంధనం, అంతరిక్షం, మంత్రులకు కేటాయించని శాఖలు