శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదులు మరోసారి స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఈ ఘటన జరిగింది. లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛాతికి బుల్లెట్ గాయాలైన ఒకర్ని శ్రీనగర్లోని ప్రత్యేక ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరో వ్యక్తి కాలికి బుల్లెట్ గాయమైంది. పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్గా వీరిని గుర్తించినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. స్థానిక కోళ్ల ఫారం వాహనం డ్రైవర్గా ఒకరు, సహాయకుడిగా మరొకరు పని చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, స్థానికేతరులైన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.