థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు కీలక తీర్పును వెలువరించింది. 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షను విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు. ఐపీసీ, పోక్సో చట్టం కింద దోషిని శిక్షించారు. 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు 30వేల జరిమానా కూడా విధించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఈ ఆదేశాలను జారీ చేశారు. కానీ తీర్పు కాపీని శుక్రవారం రిలీజ్ చేశారు. బాధితురాలి సోదరుడికి నిందితుడు స్నేహితుడని ప్రాసిక్యూటర్లు వాదించారు. 2015, జనవరి 15వ తేదీ అత్యాచార ఘటన జరిగింది. నెల రోజుల పాటు ఆ వ్యక్తి మైనర్ను రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆ అమ్మాయి శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలిని ఆదుకోవాలని జడ్జి ప్రభుత్వాన్ని కోరారు.