లక్నో: ఒక వ్యక్తి, కూతురి అత్తతో కలిసి పారిపోయాడు. (man elopes with daughter’s mother-in-law) వారి మధ్య సంబంధం రెండు కుటుంబాల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో మధ్య వయస్కులైన ఆ జంట రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో ఈ సంఘటన జరిగింది. 44 ఏళ్ల రామ్నివాస్ రాథోడ్ భార్య చనిపోయింది. అతడికి ఒక కుమార్తె ఉంది.
కాగా, ఆశారాణి అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రామ్నివాస్ తన కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి మే నెలలో పెళ్లి చేశాడు. నాటి నుంచి తరచుగా కుమార్తె అత్తవారింటికి అతడు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో కుమార్తె అత్త ఆశారాణి, రామ్నివాస్ ప్రేమలో పడ్డారు. సెప్టెంబర్ 23న వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు.
మరోవైపు ఆశారాణి మిస్సింగ్పై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి వారి కోసం వెతకసాగారు. అయితే తమ మధ్య సంబంధంపై పిల్లలు, బంధువుల నుంచి వ్యతిరేకత రావడంతో రామ్నివాస్, ఆశారాణి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో ఆదివారం వారిద్దరూ కలిసి వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.