చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. చెన్నైతోపాటు సమీపంలోని మూడు జిల్లాలు బాగా ప్రభావితమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ శుక్రవారం తంథై పెరియార్ నగర్ను సందర్శించారు. వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానికులకు సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. ముంపు సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాగా, భారీ వర్షాలకు తమిళనాడులో 14 మందికిపైగా మరణించారు.