ముంబై: మహిళా పోలీసు ఉద్యోగులకు ఇది శుభవార్త. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహిళా పోలీసు సిబ్బంది పని వేళలను తగ్గించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో మహిళా పోలీసు సిబ్బంది 12 గంటల పాటు పనిచేస్తున్నారు. అయితే వారి డ్యూటీ సమయాన్ని 8 గంటలకు కుదించినట్లు మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు.