బెంగళూరు: బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీని రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన తీరును కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత జగదీశ్ శెట్టర్ తీవ్రంగా విమర్శించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం అద్వానీ ఎంతో కృషి చేశారన్నారు. మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపిందన్నారు. వయసును దృష్టిలో ఉంచుకుని, ఇంటి వద్ద నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడాలని ఆయనకు చెప్పారన్నారు. ఇది ఎలా ఉందంటే, రమ్మని పిలిచి, శుభలేఖ ఇవ్వకపోవడంలా ఉందన్నారు.