న్యూఢిల్లీ : భూమిపై కాకుండా ఏ ఇతర గ్రహాల్లోనైనా నీరు, జీవులు జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? దీనిపై ఒక అధ్యయనం ఆసక్తికర విషయం వెల్లడించింది.
పాలపుంత గెలాక్సీలోని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలలో మూడింట ఒక వంతులో నీరు ద్రవ రూపంలో ఉండొచ్చని, బహుశా జీవం కూడా ఉండే అవకాశం ఉన్నదని ‘ప్రోసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అనే జర్నల్ పేర్కొంది. మరుగుజ్జు నక్షత్రాల చుట్టూ గ్రహాలపై జీవం ఉండొచ్చని తెలిపింది.