చండీగఢ్ : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ప్రాజెక్టు లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత సర్కారు చర్యలు చేపట్టింది. గురుగ్రామ్లో నిర్మిస్తున్న స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ లైసెన్స్ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. 2008లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాబర్ట్ వాద్రాకు ఈ లైసెన్స్ను జారీ చేశారు.
తాజాగా ఈ లెసెన్స్ను హర్యానాలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రద్దు రద్దు చేశారు. 2012లో స్కైలైట్ ఈ లైసెన్స్ని వాణిజ్య కాలనీని ఏర్పాటు చేసేందుకు డీఎల్ఎఫ్కు బదిలీ చేసింది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లైసెన్స్ ఒకరికి నివాస, వాణిజ్య లేదా పారిశ్రామిక కాలనీని ఏర్పాటు చేసుకునే హక్కులు ఇస్తున్నది. 2012లో జరిగిన ఓ ల్యాండ్ డీల్ తీవ్ర వివాదాస్పదమైంది. స్కైలైట్కు చెందిన 3.35 ఎకరాల మ్యుటేషన్ను ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రద్దు చేశారు. అప్పట్లో ఆయన కన్సాలిడేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆ తర్వాత ఈ అంశం చర్చనీయాంశమైంది.