న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్లో నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం సాగుతోంది. సీఎం అశోక్ గెహ్లోత్ను తప్పించి మరో నేతకు పాలనా పగ్గాలు అప్పగించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా ప్రజల ముందుకెళ్లాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం యోచిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సచిన్ పైలట్ గురువారం భేటీ కావడంతో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో అధికార పోరు మళ్లీ మొదలైంది. గతంలో అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ల మధ్య పవర్ వార్కు పార్టీ అగ్రనాయకత్వం జోక్యంతో తాత్కాలికంగా తెరపడింది.
అప్పట్లో పైలట్ డిప్యూటీ సీఎం పదవితో పాటు టీసీసీ చీఫ్ పదవుల నుంచి వైదొలిగారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సచిన్ పైలట్ కీలక పదవిపై కన్నేయడంతో రాజస్దాన్ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.