Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన తరహాలో కాంగ్రెస్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీల సంతుష్టీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ రహిత భారత్ అవసరమని, ఎస్పీ, బీఎస్పీ రహిత యూపీని ఆవిష్కరించాలని కేశవ్ ప్రసాద్ మౌర్య పిలుపు ఇచ్చారు.
కాంగ్రెస్ నేతల తప్పుడు పనులను ప్రధాని మోదీ వెల్లడించడంతో వారు అసహనానికి లోనవుతున్నారని చెప్పారు. కన్నౌజ్ లోక్సభ స్ధానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ పేరును ఎస్పీ వెల్లడించడంతో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు వ్యక్తులు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారని, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాల ఒరవడి ఆ పార్టీలో స్పష్టంగా వెల్లడవుతోందని యూపీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
ఓటమి భయంతో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లో 80 స్ధానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Konda Vishweshwar Reddy | చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా..?