Sabarimala | మండల-మకర విలక్కు పర్వదినం సందర్భంగా కేరళలోని పథానంథిట్ట జిల్లాలో గల శబరిమల అయ్యప్ప ఆలయం తిరిగి సోమవారం తెరుచుకుంది. రెండు నెలల పాటు ఆలయంలో పూజలు చేస్తారు. సోమవారం సాయంత్రం పూజరులు ప్రత్యేక పూజలు జరిపా. మంగళవారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. మండల పూజ ఉత్సవాల కోసం 41 రోజులు తెరిచి ఉంచుతారు. అంటే వచ్చేనెల 26న తిరిగి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మకర విలక్కు పూజలు నిర్వహిస్తారు. మండల మకర విలక్కు పూజల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విస్తరించకుండా విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మంగళవారం నుంచి రోజూ 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు ఎంట్రీ ఉంటుంది. వర్షాలు, వాతావరణ ప్రతికూలత పరిస్థితుల నేపథ్యంలో తొలి మూడు రోజులు తక్కువమంది భక్తులకే ఆలయ ప్రవేశం ఉంటుందని పేర్కొన్నది. భక్తుల భద్రత దృష్ట్యా పంపానదిలో స్నానాలను నిషేధించినట్లు వెల్లడించింది.
కోవిడ్ నేపథ్యంలో టీకా రెండు డోస్లు తీసుకున్నవారు 72గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధృవపత్రం సమర్పించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుంది. కొవిడ్-19 దృష్ట్యా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం సమర్పించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుంది. క్యూలైన్లో భౌతికదూరం పాటించడం, మాస్ ధరించడం విధిగా పాటించాలని ఆదేశించింది.