తిరువనంతపురం: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గోషిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ (Kerala woman) స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన రాష్టానికి తిరిగి వచ్చింది. కొచ్చిన్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్లో స్థానిక పాస్పోర్ట్ అధికారి ఆమెను రిసీవ్ చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కాగా, ఇరాన్ ప్రభుత్వం, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సమిష్టి కృషితో కేరళలోని త్రిసూర్కు చెందిన భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సురక్షితంగా చేరుకుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 13న ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఆ కార్గో షిప్లో ఉన్న మిగతా 16 మంది భారతీయ సిబ్బంది సంక్షేమం, వారిని స్వదేశానికి రప్పించేందుకు ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.