Kerala : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ ఎగరేసిన జాతీయ జెండా తలకిందులైంది. మంత్రి, జిల్లా కలెక్టర్తో పాటు గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అధికారులు కూడా తలకిందులైన జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అయితే ఈ విషయాన్ని పాత్రికేయులు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ జెండాను సరి చేసేంత వరకూ కార్యక్రమాన్ని అలాగే నిలిపేశారు. పది నిమిషాల్లో జాతీయ జెండాను అవనతం చేసి, సరిగ్గా ఎగిరేసిన తర్వాతే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.