తిరువనంతపురం: వరకట్నం, మహిళలపై అరాచకాలకు వ్యతిరేకంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం, తీసుకునే ఆచారానికి స్వస్తి పలకడంపై అవగాహన కల్పించాలని పలు గాంధేయ సంస్థలు ఇచ్చిన పిలుపుపై గవర్నర్ ఆరిఫ్ స్పందించారు. తన అధికార నివాసమైన రాజ్భవన్లో బుధవారం ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఒక సామాజిక కారణం కోసం గవర్నర్ నిరాహార దీక్ష చేయడం దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి.
మరోవైపు గవర్నర్ ఆరిఫ్ నిరాహార దీక్షకు కేరళ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారుల కండ్లు తెరిపించేందుకు గవర్నర్ ఆరిఫ్, గాంధేయ మార్గాన్ని పాటించారని అన్నారు.