కేరళలోని ఓ కోర్టు తీర్పు
కొట్టాయం (కేరళ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని (నన్)పై లైంగికదాడి కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నిందితుడిపై నేరాన్ని రుజువు చేసే ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే నిర్దోషిగా ప్రకటిస్తున్నానని కొట్టాయంలోని ‘అడిషనల్ డ్రిస్టిక్, సెషన్స్ కోర్టు-1’ న్యాయమూర్తి ప్రకటించారు. అయితే, ఈ కేసును దర్యాప్తు చేసిన ఐపీఎస్ హరిశంకర్ స్పందిస్తూ తీర్పు ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు. దీనిని పై కోర్టులో అపీల్ చేస్తామన్నారు.