బెంగళూరు : హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో డ్రెస్ కోడ్పై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విస్తృత ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సోమవారం నుంచి విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయంలో తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ కోర్టు.. కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను సైతం సోషల్ మీడియాలో సైతం పెట్టవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.