న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా దేశంలో చాలా కొద్దిమందికే రాజ్యాంగ నిబంధనలపై అవగాహన ఉండటం దురదృష్టకరమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలు తప్పనిసరిగా రాజ్యాంగ హక్కులు, విధుల గురించి తెలుసుకోవాలని సూచించారు. బుధవారం ఈస్ట్రన్ బుక్ కంపెనీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. జడ్జిలు తమ తీర్పులను సరళతర భాషలో రాయాలని కోరారు. పాశ్చాత్య దేశాల్లో చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగంపై అవగాహన ఉంటుందని, మన దగ్గర కూడా అలాంటి సంస్కృతి రావాలన్నారు.