న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర(Fuel Prices)ను పెంచారు. 5.46 శాతం మేర విమాన ఇంధనం ధరను పెంచేశారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లకు వాడే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా పెంచారు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ.9.50 పెంచారు. స్వదేశీ విమాన సర్వీసులకు చెందిన ఇంధన ధరను లీటరుపై రూ.121.28 పెంచినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రతి లీటరు ఇంధనంపై రూ.5 పెంచడం వల్ల ఆ వర్తింపు జెట్ ఫ్యూయల్కు కూడా వచ్చింది. ఏటీఎఫ్ ధర పెరగడం వల్ల .. విమాన సంస్థలపై మరింత భారం పడనున్నది. ఆపరేటింగ్ ఖర్చుల్లో ఏటీఎఫ్ది 40 శాతం ఉంటుంది. గతంలో కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.2738గా ఉండేది. ఇప్పుడు ఆ సిలిండర్ ధర రూ.2747.50కి పెరిగింది. ఇక 5 కేజీల వంట గ్యాస్ ఎల్పీజీపై కూడా ధరను పెంచారు. 5కేజీల సిలిండర్ ధరను 762 నుంచి 764కు పెంచారు.