న్యూఢిల్లీ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాషర్ వెల్లడించారు.
విద్యార్థులకు మార్చి ఒకటో తేదీ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్లైన్ విధానంలో రెండు విడుదలుగా నిర్వహించగా.. గతేడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు విడుదల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొన్న క్రమంలో యథావిధిగా రెండు విడుతల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
మరో వైపు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష గురువారమే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించట్లు పేర్కొంది. జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఉంటుందని, జూలై 18న ఫలితాలను ప్రకటిస్తామని, మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలవుతుందని వివరించింది.