పాట్నా : బీహార్లోని సహర్స పోలీసులు గురువారం జేడీయూ నేత మహమ్మద్ ఒవైస్ కర్ని అలియాస్, ఆయన భార్య, మరికొందరిని అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రీటా కుమారిపై బుధవారం దాడి చేయడంతోపాటు, ఆమెతోపాటు ఉన్న పోలీసు బృందాన్ని పెట్రోలు పోసి తగులబెట్టేందుకు వీరు ప్రయత్నించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
అంతకుముందు ఓ పోలీసు బృందంపై దాడి చేసిన కేసులో కర్నిని అరెస్ట్ చేయడం కోసం రీటా బృందం గ్రామానికి వెళ్లగా, కర్ని అనుచరులు దాడికి ప్రయత్నించారు.