న్యూఢిల్లీ : వివిధ క్రీడల్లో సత్తా చాటి అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఎందరో క్రీడాకారులు ప్రస్తుతం కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. స్టార్ అథ్లెట్ల నుంచి ప్రముఖ క్రికెటర్ల వరకూ ఎందరో క్రీడాకారులు ప్రభుత్వ నిరాదరణ వల్లో, ప్రణాళిక కొరవడటం తోనో కారణమేదైనా ఇప్పుడు దీనస్ధితిలో ఉన్నారు. తాజాగా బెంగాల్కు చెందిన ఓ మహిళా ఫుట్బాల్ ప్లేయర్ ఒకప్పుడు భారత్ తరపున అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు.
She is Polami Adhikary a football player who has represented India at the international level. Today she has to support her family as an online food delivery person. #football pic.twitter.com/pGnJ0QOUEg
— Sanjukta Choudhury (@SanjuktaChoudh5) January 10, 2023
అప్పట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారిణి పౌలోమి అధికారి ఇప్పుడు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. పౌలోమి ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్లిప్లో పౌలోమి జొమాటో టీ షర్ట్ ధరించి ఫుడ్ డెలివరీ చేస్తూ కనిపించింది.
ఈ వీడియోలో ఆమె తన దుస్ధితి గురించి చెప్పుకొచ్చింది. కోల్కతాలోని బెహలా ప్రాంతానికి చెందిన పౌలోమి ప్రస్తుతం చరుచంద్ర కాలేజ్లో చదువుతోంది. అండర్ 16 ఫుట్బాల్ టోర్నీల్లో భారత్ తరపున పాల్గొంటూ తాను జర్మనీ, బ్రిటన్, శ్రీలంక సహా పలు దేశాల్లో పర్యటించానని ఆమె చెప్పుకొచ్చారు. ఆపై తన కలలను నెరవేర్చుకోలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా మారినట్టు తెలిపింది. తాను రోజంతా కష్టపడితే ఖర్చులు పోను కేవలం రూ.300 నుంచి రూ .400 మిగులుతాయని ఆమె చెప్పుకొచ్చారు.