న్యూఢిల్లీ: క్రికెటర్లకు రివార్డులు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారాలకు రతన్ టాటా(Ratan Tata) ఫుల్స్టాప్ పెట్టేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలికి కానీ ఎటువంటి ప్లేయర్కు కానీ రివార్డు అంశాన్ని ప్రకటించలేదన్నారు. వ్యాపారవేత్త రతన్ టాటా ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రికెట్ గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని, దాంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు, వీడియోలను నమ్మవద్దు అని, ఏదైనా ఉంటే తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేస్తానన్నారు.
I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players.
I have no connection to cricket whatsoever
Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official…
— Ratan N. Tata (@RNTata2000) October 30, 2023
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిన తర్వాత ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్కు 10 కోట్లు రివార్డు ప్రకటించినట్లు రతన్ టాటా పేరిట సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రతన్ టాటా తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు.