న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారతీయుల్లో ఉప్పు వాడకం పరిమితికి మించి 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ప్రతి రోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5గ్రాములు) కన్నా 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారు గుండెపోటు, స్ట్రోక్స్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్లోని వయోజనులందరీలో ఉప్పు వాడకం ఎక్కువగా ఉందని పరిశోధన తేల్చింది. పురుషులు ప్రతిరోజూ 8.9గ్రాములు, మహిళలు 7.9 గ్రాములు తీసుకుంటున్నారు. సోడియం తగ్గించుకోగలితే 50శాతం మంది హైబీపీ సమస్యల నుంచి బయటపడతారని ఐసీఎంఆర్ డైరెక్టర్ ప్రశాంత్ మాథూర్ అన్నారు. అధిక ఉప్పుతో వచ్చే ఆరోగ్య ముప్పుపై అవగాహన తీసుకురావాలని సూచించారు.