మలయాళ చిత్రం ‘దృశ్యం’ తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మాణం జరుపుకొని మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కమల్హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో ‘పాపనాశమ్’ పేరుతో తమిళ రీమేక్ను తెరకెక్కించారు. ‘దృశ్యం-2’ కూడా మలయాళంలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండోభాగాన్ని తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్లో కమల్హాసన్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఆయన సరసన సీనియర్ నాయిక మీనా నటించనుందని సమాచారం. కమల్హాసన్-గౌతమి మధ్య విభేదాలు రావడంతో వారిద్దరి బంధానికి తెరపడింది. దీంతో ‘దృశ్యం-2’ రీమేక్లో గౌతమి నటించే అవకాశాలులేవంటున్నారు. తెలుగు వెర్షన్లో నటిస్తోన్న మీనాను కమల్హాసన్ సరసన ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. గతంలో కమల్హాసన్, మీనా కలిసి తమిళంలో ‘అవ్వై షణ్ముఖి’ (1996) చిత్రంలో నటించారు. 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయిక కార్యరూపం దాల్చనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.