న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో.. ఈ ఏడాది 125 సార్లు అతిభారీ వర్షాలు కురిసినట్లు భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన అయిదేళ్లలో ఇలాంటి వర్షాలు చోటుచేసుకోవడం రికార్డు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వాతావరణం విపరీతంగా ప్రవర్తించడానికి గల కారణాలను కూడా ఐఎండీ వెల్లడించింది. నైరుతీ రుతుపవనాలు ఆలస్యంగా వెనుదిరగడంతో పాటు సాధారణ పీడనం కన్నా అధిక స్థాయిలో రుతుపవనాలు ఉండడం వల్ల ఇలాంటి వర్ష ఘటనలు చోటుచేసుకున్నట్లు ఐంఎడీ చెప్పింది. ఇక నవంబర్లో కురవబోయే వర్షాల గురించి కూడా ఐఎండీ ఇవాళ రిపోర్ట్ను వెలువరించింది. తమిళనాడు, పుదుచ్చరి, కరైకల్, ఆంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.