న్యూఢిల్లీ : రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం విశేషం. ఇళయరాజా(తమిళనాడు), విజయేంద్ర ప్రసాద్(తెలుగు వ్యక్తి), పీటీ ఉష(కేరళ), వీరేంద్ర హెగ్డే(కర్ణాటక)ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి.
విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాల పాటు సృజనాత్మక సేవలు అందించారని మోదీ ప్రశంసించారు. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయని కొనియాడారు. ఇళయారాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం అని చెప్పారు. పీటీ ఉష జీవితం.. ప్రతి భారతీయుడికి ఆదర్శంగా నిలిచిందని మోదీ అన్నారు. అనేక ఏండ్లుగా ఎందరో క్రీడాకారులను పీటీ ఉష తయారు చేశారని కొనియాడారు. వీరేంద్ర హెగ్డే సమాజసేవలో ముందున్నారు. ఆరోగ్యం, విద్య కోసం విశేష కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు.
The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC
— Narendra Modi (@narendramodi) July 6, 2022