ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూలై సెషన్ 2022 కోసం రీ-రిజిస్ట్రేషన్ తేదీలను జూలై 15, 2022 వరకు పొడిగించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇగ్నో అధికారిక సైట్ http://ignou.ac.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. సెషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, సమర్థ్ పోర్టల్ http://ignou.samarth.edu.in ద్వారా కూడా రీ రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ అవ్వొచ్చు. విద్యార్థులు తదుపరి సంవత్సరం/సెమిస్టర్ కోసం తమ రీ-రిజిస్ట్రేషన్ ఫాంలను సమర్పించవచ్చు. జూలై 2022 సెషన్ కోసం రీ-రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఆన్లైన్ చెల్లింపు చేయవచ్చు.
ఇగ్నో జూలై సెషన్ 2022 రీ రిజిస్ట్రేషన్ ఇలా..
http://ignouadmission.samarth.edu.in అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, ఇతర వివరాలను అందించడం
ద్వారా పోర్టల్లో రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
దరఖాస్తు ఫాంను నింపండి.
అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుం ఏదైనా ఉంటే చెల్లించండి.
దరఖాస్తు ఫారంను సమర్పించండి.
ఇగ్నో దరఖాస్తు ఫాంను డౌన్లోడ్ చేయండి.
భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్అవుట్ తీసుకోండి.