ఇంకా కరోనా కొత్త వేరియంట్ పుట్టలేదని ఐసీఎంఆర్ ఎపిడమాలజీ, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ రామన్ గంగేడ్కర్ పేర్కొన్నారు. అయితే ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకోలేదో, ఇప్పటికే కరోనా సంక్రమించిన వారు, పెద్దలు కచ్చితంగా మాస్క్ మాత్రం ధరించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నడుస్తున్నది ఫోర్త్ వేవ్ అని తాను భావించడం లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచం అంతా బీఏ.2 వేరియంట్ వల్ల ప్రభావితం అయిన వారే ఉన్నారన్నారు. అయితే.. మాస్క్ అవసరం లేదంటే.. ఇక కరోనా లేదన్న తప్పుడు అభిప్రాయం చాలా మందిలో ఉందని, అది సరైన అభిప్రాయం కాదని డాక్టర్ రామన్ గంగేడ్కర్ స్పష్టం చేశారు.