సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ హైవేపై వైమానిక దళం ఎయిర్షో నిర్వహించింది. ఫైటర్ విమానాలు ఎక్స్ప్రెస్వేపై దిగాయి. సుల్తాన్పూర్లోని ఖర్వాల్ ఖేరి ప్రాంతంలో నిర్మించిన ఎక్స్ప్రెస్వేపై మిరాజ్ 2000 యుద్ధవిమానం దిగింది. ఇవాళ మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ ఎయిర్ షోను ప్రత్యక్షంగా వీక్షించారు. ఎక్స్ప్రెస్వేపై ప్రధాని మోదీ కూడా ఐఏఎఫ్ సీ-130 హెర్క్యూల్స్ విమానంలో దిగారు. మధ్యశ్రేణి రవాణా విమానం ఏఎన్-32 కూడా కర్వాల్ ఖేరిలో నిర్మించిన ఎయిర్స్ట్రిప్పై ల్యాండ్ అయ్యింది. మరో యుద్ధ విమానం జాగ్వార్ కూడా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై నిర్మించిన ప్రత్యేక ఎయిర్స్ట్రిప్పై దిగింది.