న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత 24గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు రికార్డవగా.. 31 మంది మరణించారు. త్వరలోనే ఇన్ఫెక్షన్ రేటు 10.55శాతానికి చేరుకుంటుందని, త్వరలోనే ఢిల్లీని ఆంక్షల నుంచి విముక్తి కల్పిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే, ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గా.. మరణాల్లో మాత్రం పెద్దగా తేడా కనిపించలేదు.
ఇదిలా ఉండగా.. 57,132 కొవిడ్ కేసులు పరీక్షలు జరిగాయి. గత రెండు వారాల క్రితం వరకు నిత్యం 90వేలకుపైగా పరీక్షలు జరగ్గా.. ప్రస్తుతం గణనీయంగా తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. 9,127 మంది మంది డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 18,03,499కు చేరగా.. 17,35,808 మంది కోలుకున్నారని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో మొత్తం 25,681 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. ప్రస్తుతం మరణాల రేటు 1.42శాతంగా ఉందని, ప్రస్తుతం 42వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని వివరించింది.