కోయంబత్తూర్: మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్హాసన్.. అసలు సిసలు రాజకీయనాయకుడిగా మారే దిశగా అడుగులు వేస్తున్నారు. తమిళనాడులోని దక్షిణ కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మంగళవారం ఉదయం మార్నింగ్వాక్కు వచ్చిన జనంతో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉక్కడం ప్రాంతంలోని చేపల మార్కెట్ను సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.