గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ హిసెన్స్ ఇండియాలో తన కొత్త 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ ‘120ఎల్9జీ’ని బుధవారం విడుదల చేసింది. ఈ లేజర్ టీవీ ధర రూ.4,99,999. అంటే దాదాపు రూ.5లక్షలు. ఇది 3,000 ల్యూమెన్స్ ప్రకాశం 4కే యూహెచ్డీ పిక్చర్ క్వాలిటీతో వస్తుంది.
ఈ లేజర్ టీవీ జూలై 6, 2022 (బుధవారం) నుంచి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. ఈ 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ 120ఎల్9జీని అమేజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ కలర్ లేజర్ టెక్నాలజీతో మన ముందుకు వచ్చిందని, స్వచ్ఛమైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం లేజర్లతో పిక్చర్ క్లిస్టర్ క్లియర్గా ఉంటుందని ఆ కంపెనీ ఇండియా సీవోవో రిషి టాండన్ తెలిపారు.