సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మృతికి గౌరవ సూచికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. కొవిడ్-19 తదనంతర సమస్యలతో వీరభద్రసింగ్ గురువారం తెల్లవారుజామున మృతిచెందిన సంగతి తెలిసిందే. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆయన మృతిచెందారు. మృతదేహాన్ని నివాసానికి తరలించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు హిమాచల్ ప్రభుత్వం రాష్ట్ర సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించబడవు.