న్యూఢిల్లీ : ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. మార్చిలో నెత్తిని మాడ్చే ఎండలతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రెండు వాతావరణ సంస్థలు గురువారం హెచ్చరించాయి. గోధుమ, నూనె గింజలు పండించే రాష్ర్టాల్లో సగటు ఉష్ణోగ్రత కన్నా అధిక వేడి నమోదవుతుందని, దీని కారణంగా పంట దిగుబడి కూడా తగ్గుతుందని ఐఎండీ వెల్లడించింది.
అధిక ఉష్ణోగ్రతల నమోదుతో మార్చిలో విద్యుత్తు డిమాండ్ కూడా అనూహ్యంగా పెరుగుతుందని, నీటి ఎద్దడి సమస్యలు వస్తాయని పేర్కొన్నది. మార్చిలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్లో సాధారణం కన్నా 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చని అధికారి ఒకరు తెలిపారు.