న్యూఢిల్లీ: ఐఎన్ఎల్డీ నేత(INLD Leader) నఫే సింగ్ రాథీ హత్య కేసులో ఇద్దరు షూటర్లను అరెస్టు చేశారు. ఆ ఇద్దర్నీ గోవాలో అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని జాజర్ జిల్లాలో ఫిబ్రవరి 25వ తేదీ వాహనంలో వెళ్తున్న ఐఎన్ఎల్డీ నేత నఫేతో పాటు కార్యకర్త జై కిషణ్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపారు. బహదూర్ఘర్ వద్ద ఈ ఘటన జరిగింది. హర్యానా టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో ఆశిష్, సౌరభ్లను అరెస్టు చేశారు. గోవాలో వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. నార్త్ గోవాలోని ఓ హోటల్ బస చేస్తున్న వాళ్లను పట్టుకున్నారు.
ఆశిష్, సౌరభ్, నకుల్, అతుల్ అనే నలుగురు వ్యక్తులు ఐఎన్ఎల్డీ నేతలపై కాల్పులు జరిపినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఇద్దరు షూటర్లు వేర్వేరు సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు.
యూకే గ్యాంగ్స్టర్ కపిల్ సంగ్వాన్తో ఆ ఇద్దరు షూటర్లకు లింకులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎన్ఎల్ఎల్డీ నేత హత్య కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్తో పాటు 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.