బెంగళూరు, సెప్టెంబర్ 19: జీఎస్ఎల్వీ-ఎంకే 3 (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) తయారీ బాధ్యతను స్వదేశీ భాగస్వామ్య కంపెనీలకు అప్పగించాలని అంతరిక్ష విభాగం భావిస్తున్నది. ఇప్పటికే పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) తయారీ చేసేందుకు హెచ్ఏఎల్-ఎల్ అండ్ టీ, బీఈఎల్-అదానీ-బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్ నుంచి మూడు బిడ్లు అందాయి. కాంట్రాక్టు దక్కిన సంస్థ 5 పీఎస్ఎల్వీలను తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు ఖరారు కాగానే జీఎస్ఎల్వీ-ఎంకే 3 తయారీకి ఈవోఐ జారీ చేయనున్నట్టు అంతరిక్ష విభాగానికి చెందిన ఎన్ఎస్ఐఎల్ తెలిపింది.