సముద్రంలో వ్యర్థాలను విసిరేస్తే కలిగే నష్టాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కానీ, బీచ్ను సందర్శించే ప్రజలకు ఇవేమీ పట్టడంలేదు. పెద్ద ఎత్తున వ్యర్థాలను సముద్రంలోకి విసురుతున్నారు. ఈ వ్యర్థాల్లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటోంది. దీనిపై ప్రకృతి ప్రకోపించింది. సముద్రంలోని వ్యర్థాలను మొత్తం బీచ్ ఒడ్డుకు చేర్చింది. ముంబైలోని మహిమ్ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన చెత్తకుప్పల షాకింగ్ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘ముంబై మ్యాటర్స్’ అనే పేజీ ద్వారా ట్విటర్లో షేర్ చేశారు. ‘ముంబైలోని బీచ్లను తెరిచారు. సందర్శకులు మహిమ బీచ్కు వచ్చి అరేబియా సముద్రం నుంచి వచ్చిన రిటర్న్గిఫ్ట్ని చూడండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియోపై బృహత్ ముంబై కార్పొరేషన్ స్పందించింది. ‘సముద్రంనుంచి బీచ్లోకి చెత్తకొట్టుకొచ్చింది నిజమే. అయితే, దాన్ని క్లీన్ చేశాం. దయచేసి ప్రజలెవరూ బీచ్లో చెత్త వేయకండి’ అని బీఎంసీ ప్రజలను అభ్యర్థించింది.
కాగా, ఈ బీచ్లో చెత్తను చూపించే పది సెకన్ల వీడియో లక్ష వీక్షణలు పొందింది. నెటిజన్లు కోపంగా కామెంట్ చేశారు. ‘ప్రకృతి మొదట హెచ్చరిస్తుంది, దాని ప్రభావం లేనప్పుడు, అది ప్రతిస్పందిస్తుంది. ఆ రియాక్షన్ కోసం మనం వేచి ఉండకూడదు, ఎందుకంటే మనం దానిని భరించలేకపోవచ్చు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
Citizens throng Mahim beach to have a look at the #ReturnGift from ArabianSea..#PlasticPollution#MumbaiRains pic.twitter.com/1JUmIpWof2
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) July 16, 2022