అహ్మదాబాద్: గుజరాత్లో అత్యంత ప్రజాదరణ పొందిన గార్బా నృత్యం యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుంది.
మంగళవారం బోట్స్వానాలోని కసానేలో ప్రారంభమైన 18వ యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బుధవారం తెలిపారు. గుజరాతీల సంస్కృతిలో ఒక భాగంగా మారిన గార్బా నృత్యం.. యునెస్కో జాబితాలో చేరటంతో ఆ రాష్ట్ర ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.