న్యూఢిల్లీ: గణేష్ ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో ఉన్న గణనాథులు మండపాల్లో కొలువుదీరారు. (Chandrayaan-3 Ganesh Pandal) అయితే ఈ ఏడాది ఇస్రో మరో ఘనత సాధించింది. మూన్ మిషన్ చంద్రయాన్-3ను విజయవంతంగా చేపట్టింది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
కాగా, చంద్రయాన్-3 విజయం స్ఫూర్తితో ఈ ఏడాది పలు గణేష్ మండపాలను రూపొందించారు. కోల్కతా, చెన్నైలో ఇవి వెలిశాయి. ఇలాంటి ఒక గణేష్ మండపం ఎంతో ఆకట్టుకుంటున్నది. చంద్రయాన్-3 నమూనాతో దీనిని రూపొందించారు. గణేషుడి వెనుక ఒక వైపు చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. మరోవైపు చంద్రయాన్-3 నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. విభిన్నంగా ఉన్న చంద్రయాన్-3 గణేష్ మండపానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Lift-off to rover roll-out, this Ganesh Pandal on #Chandrayaan3 is absolutely mind-blowing! 🚀🌕
-Via WA pic.twitter.com/bP4v3uxDlQ
— Pawan (@PawanKChandana) September 22, 2023