Boris Johnson : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజస్థాన్లో చారిత్రక ప్రాంతాలు, కట్టడాలను చూసి మంత్రముగ్దులయ్యారు. జైపూర్లోని పురాతన కోటలను ఆయన గురువారం సందర్శించారు. చారిత్రక నేపథ్యం ఉన్న అంబర్ కోటను కూడా తిలకించారు. కోటను చూడ్డానికి వచ్చిన బోరిస్కు అంబర్ కోట సూపరింటెండెంట్ పంకజ్ ధరేంద్ర హృదయపూర్వక స్వాగతం పలికారు. ఆ తర్వాత బోరిన్ గంటన్నర సేపు కాలినడకన ప్రయాణించి జైఘర్ కోట చేరకున్నారు. కోటలో ఆయన కలియదిరిగారు. కోటలోని దీవాన్ ఇ ఆమ్ హాల్, షీష్ మహల్ను బోరిస్ చూశారు. సెక్యూరిటీ అధికారులు ఆయనతో కలిసి దిగిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఆయన జైపూర్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్కు హాజరయ్యేందుకు భారతదేశం వచ్చారు.
బోరిస్ కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధిగా 2019 నుంచి 2022 వరకు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఆయన తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని అయ్యారు. ఆర్థిక విధానల పట్ల వ్యతిరేకత పెల్లుబికడంతో లిజ్ రాజీనామా చేశారు. దాంతో, మళ్లీ ప్రధాని రేసులో నిలబడ్డారు. అయితే, మధ్యలోనే తప్పుకొన్నారు. బోరిస్ వైదొలగడంతో భారతత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానిగా రిషి గుర్తింపు సాధించారు.