గువహటి, సెప్టెంబర్ 26: అస్సాం సీఎం హిమంత భార్యకు చెందిన కంపెనీకి పీఎం కిసాన్ సంపద యోజన పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీ మంజూరుచేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. చిన్న, సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమ యూనిట్లను వదిలేసి, సీఎం భార్యకు చెందిన కంపెనీకి పథకం ద్వారా లబ్ధి చేకూర్చటం అన్యాయమని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ అంశంపై కలుగజేసుకొని నిజానిజాల్ని వెల్లడించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘ప్రభుత్వ సబ్సిడీలు, గ్రాంట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు ఇవ్వటం న్యాయం. అలాంటి యూనిట్లు అస్సాంలో అనేకమున్నాయి. వీటిని వదిలేసి సీఎం సన్నిహితులకు ఇస్తారా?’ అని లేఖలో గొగోయ్ ప్రశ్నించారు.